Shivalayam | వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్నగర్ సమీపంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన శివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలోని శిలాలయాన్నిపురావస్తు, దేవాదాయ శాఖల కనీస అనుమతి లేకుండా బుల్డోజర్తో కూల్చివేశారు.
స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండతో కాంట్రాక్టర్ ఇష్టానుసారం గుడిని నేలమట్టం చేశారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న శివాలయాన్ని సమీకృత పాఠశాల నిర్మాణం కోసం బుల్డోజర్తో కూల్చడం అన్యాయమని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ చరిత్రకు మచ్చ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమీకృత పాఠశాల నిర్మాణం కోసం 800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేసిన రేవంత్ ప్రభుత్వం
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన శివాలయం కూల్చివేత
రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న శివాలయాన్ని సమీకృత పాఠశాల నిర్మాణం… https://t.co/HMpPTJpUdy pic.twitter.com/BcscaHc5f3
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2026
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!