మైనర్లు, పరిపక్వత లేని యువతకు గాలం
విచక్షణ మరిచి రాజకీయాలు
సోషల్ మీడియా వేదికగా చీప్ పాలి‘ట్రిక్స్’
టీనేజర్లతో విపరీత ధోరణులు
ఒక్కొక్కటిగా ‘కాషాయ’ కుట్రలు బట్టబయలు
అప్రమత్తంగా ఉండాల్సింది తల్లిదండ్రులే
వరంగల్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) / మహబూబాబాద్, (నమస్తే తెలంగాణ): పాముకు తలలో.. తేలుకు తోకలో విషముంటుంది.. కానీ దుర్మార్గునికి తలా తోక నియమం లేక శరీరమంతా విషమే ఉంటుందని ఈ పద్య భావం. ఇది నేటి బీజేపీ నేతలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుందని అటు రాజకీయ, ఇటు మానసిక విశ్లేషకుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విధంగానైనా సరే అధికారంలోకి రావాలన్న దుర్బుద్ధితో పరిపక్వత లేని మైనర్లు, యువత మెదళ్లలో విద్వేషమనే విషాన్ని ఎక్కించి ఆ పార్టీ పావులుగా వాడుకుంటోందన్నది బహిరంగ రహస్యం. సోషల్ మీడియాను అదునుగా చేసుకుని విచక్షణ లేకుండా పిల్లలతో చీప్ పాలి‘ట్రిక్స్’ ప్లే చేస్తున్న తీరు కమలం పార్టీని నవ్వుల పాలుజేయడమే కాకుండా అభం శుభం తెలియని వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నది. కరీంనగర్ కేంద్రంగా లోకజ్ఞానమెరుగని ఓ ఏడో తరగతి పిల్లడితో ఏకంగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపైనే దుష్ప్రచారానికి దిగి.. తన దిగజారుడు రాజకీయాలను బజారున పడేసుకున్న ‘కాషాయ’ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విమర్శించాలంటే ముందు విషయంపై స్ఫూర్తి స్పష్టత ఉం డాలి. విమర్శలో సత్యం, నిజాయితీ ఉంటేనే అన్నమాటపై నిలబడాలి. కానీ, కమలం పార్టీకి అసలు విషయ మే లేక విద్వేషాలను రెచ్చగొడుతూ.. వాటి నే ఆయుధాలుగా వాడుకుంటున్నది. ఇందుకు పరిపక్వత లేని పిల్లలను, యువతను పావులుగా వాడుకుంటున్నది. లోకజ్ఞానమెరుగని వారి మెదళ్లలో విషమెక్కిస్తూ ఆ విషాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై చిమ్మిస్తున్నది. పేద, మధ్యతరగతి పిల్లలను, జులాయిగా తిరిగేవాళ్లను వాడుకుంటూ సర్కారుపై అసత్య ప్రచారాలు చేయిస్తూ, అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టించడం ఆ పార్టీ రివాజుగా మారింది.
అదుపులేని సోషల్ మీడియానే అదును
ఇపుపడు సెల్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ అనేవి ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో తప్పనిసరయ్యాయి. వీటిద్వారా పుట్టుకొచ్చిన.. అదుపంటూ చేయలేని సోషల్ మీడియానే బీజేపీకి అదునుగా మారింది. ప్రపంచాన్ని దగ్గర చేసే టెక్నాలజీని ఆ పార్టీ నీచ రాజకీయాలకు వాడుకుంటున్నది. ఇందుకు భవిష్యత్ తరాలను పణంగా పెడుతున్నది. బడి పిల్లల్లోనూ విష బీజాలు నాటుతున్నది. స్వార్థ రాజకీయాలతో అమాయకులను ఆగం చేస్తున్నది. అసలే మనో వికా సం లేని వయస్సు వారిలో విద్వేషాలను రెచ్చగొడు తూ పబ్బం గడుపుకుంటున్నది. డూప్లికేట్ ఐడీలు క్రియేట్ చేసి ప్రత్యర్థి పార్టీలను, పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని పిల్లలతో చీప్ పాలి‘ట్రిక్స్’ చేస్తున్నది. చేసేది తప్పుడు పనని తెలిసీ తప్పుడు మార్గాల్లోనే వెళ్తున్నది. పెద్దలు చేస్తే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, పిల్లలతో అయితే చట్టంలో మినహాయింపులు ఉంటాయని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నది. ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన ఏడో తరగతి పిల్లగాడు ఉన్నత స్థాయి వ్యక్తిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసు వెలుగు చూడడం తో రాష్ట్ర పోలీసు యంత్రాంగమే కాకుండా యావత్ప్రజానీకం అవాక్కైంది. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ లు చేసే తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల మద్దతు పొందాలనే సూత్రానికి భిన్నంగా వెళ్లడం అలవాటైన బీజేపీ, ఇందుకోసం పిల్లలను వాడుకోవడం విస్తుగొలుపుతున్నది.
ద్వేషమే ఎజెండా
అకారణంగా ఒకరిని ఎవరూ వ్యతిరేకరించరు. కానీ, బీజేపీ లీడర్లు ఇప్పుడు ద్వేషమే ఎజెండాగా రాజకీయాలు చేస్తున్నారు. దీన్నే కొత్త ట్రెండ్గా మార్చా రు. సోషల్ మీడియా వేదికగా నిత్యం కొన్ని వర్గాలను, కొందరు నాయకులను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారాలు చేయిస్తున్నారు. ఇంకా హద్దులు దాటి బూతులు కూ డా తిట్టిస్తున్నారు. దేశంలో ఎక్కడో ఏదో జరిగితే దాని కి మన పక్కన ఉండే వ్యక్తులే కారణమని ప్రచారం చేసి తప్పుదారి పట్టిస్తున్నారు. ఒక సందర్భంలో తీసిన వీడియోలను, ఫొటోలను మరో అసలు సంబంధం లేనివాటితో లంకెపెడుతూ మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడంలో వారికివారే సాటిగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పుకార్లపై స్పందించిన జెర్సీ డైరెక్టర్..!
అరుదైన బ్లడ్ క్లాట్.. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ నిలిపేసిన అమెరికా
పని ఎక్కువ అవుతున్నదంటూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు