వాషింగ్టన్: కరోనా మహమ్మారిని తరిమేయడానికి వచ్చిన సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపేసింది. ఈ వ్యాక్సిన్ కారణంగా అరుదైన, తీవ్రమైన రక్తగడ్డ కట్టే సమస్య ఎదురవడమే దీనికి కారణం. ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఆరు మందిలో బ్లడ్ క్లాట్ అయినట్లు గుర్తించారు. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్పై మంగళవారం ప్రకటన విడుదల చేశామని, ముందు జాగ్రత్త చర్యగా ఈ వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపేయాలని సిఫార్సు చేస్తున్నట్లు అమెరికా డ్రగ్ నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ట్వీట్ చేసింది.
ఏప్రిల్ 12వ తేదీ వరకూ అమెరికాలో మొత్తం 68 లక్షల జే&జే వ్యాక్సిన్లను ఇచ్చారు. ఇందులో అరుదైన, తీవ్రమైన రక్తం గడ్డ కట్టిన సమస్యతో బాధపడుతున్న ఆరుగురి డేటాను సమీక్షిస్తున్నట్లు ఎఫ్డీఏ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఈ తీవ్ర సమస్యలు చాలా అరుదుగానే కనిపిస్తున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
కొత్త రోగాలు వస్తాయి.. వన్యప్రాణుల అమ్మకాలను ఆపండి: డబ్ల్యూహెచ్వో
స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర ఎంత? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
పని ఎక్కువ అవుతున్నదంటూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా
IPL 2021: అతన్ని 16 కోట్లు పెట్టి కొన్నది ఇందుకేనా?
ప్రపంచంలో ఆ 8 మంది దగ్గరే 75 లక్షల కోట్ల సంపద
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ వింత యాక్షన్ చూశారా.. వీడియో
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్సిగ్నల్
పది లక్షల టన్నుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వృథా నీళ్లు సముద్రంలోకి!