జెనీవా: కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉన్న కారణంగా ఆహార మార్కెట్లో బతికి ఉన్న అడవి క్షీరదాల అమ్మకాలను నిలిపి వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కోరింది. పెద్ద సంఖ్యలో జనాభాకు సాంప్రదాయ మార్కెట్లు జీవనోపాధిని అందిస్తాయని, వీళ్లతోపాటు సాధారణ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి వాటి అమ్మకాన్ని నిలిపేయడమే మంచిదని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది.
అసలు ఈ కరోనా మహమ్మారి కూడా అలాంటి మార్కెట్ నుంచే వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆ సంస్థ గుర్తు చేసింది. చైనాలో ని వుహాన్ మార్కెట్లో తొలిసారి కొవిడ్ సోకిన వాళ్లలో అక్కడి స్టాళ్ల యజమానులు, ఉద్యోగులు, మార్కెట్కు తరచూ వచ్చే వాళ్లే ఉన్నారని డబ్ల్యూహెచ్వో తెలిపింది.
ఎమర్జెన్సీ చర్యగా భావించి వెంటనే అడవి జంతువుల అమ్మకాలను మార్కెట్లలో నిలిపి వేయాలని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది.
జంతువులు, అందులోనూ వన్యప్రాణుల వల్లే 70 శాతానికిపైగా కొత్తగా వస్తున్న అంటు రోగాలకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వీటిలో చాలా వరకూ గతంలో ఎప్పుడూ చూడని వైరస్లే ఉంటున్నాయని కూడా తెలిపింది. ఇలాంటి అడవి జంతువులను అమ్మే మార్కెట్లను వీలుంటే మూసేయాలని కూడా ఆయా దేశాల ప్రభుత్వాలను డబ్ల్యూహెచ్వో కోరింది.
ఇవి కూడా చదవండి
స్పుత్నిక్ వ్యాక్సిన్ ధర ఎంత? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
పని ఎక్కువ అవుతున్నదంటూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా
IPL 2021: అతన్ని 16 కోట్లు పెట్టి కొన్నది ఇందుకేనా?
ప్రపంచంలో ఆ 8 మంది దగ్గరే 75 లక్షల కోట్ల సంపద
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ బౌలర్ వింత యాక్షన్ చూశారా.. వీడియో
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్సిగ్నల్
పది లక్షల టన్నుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వృథా నీళ్లు సముద్రంలోకి!
ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ