న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. కరోనాతో నష్టపోతున్న పేదలందరికీ రూ. 6 వేలు చొప్పున ఇవ్వాలని సోనియా తన లేఖలో డిమాండ్ చేశారు. వలస కార్మికుల ప్రయాణం మళ్ళీ ప్రారంభమైన నేపథ్యంలో చర్యలు చేపట్టాలని సూచించారు. దేశంలో కరోనా టీకాల కొరత లేకుండా అన్నీ రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. వయసు ప్రాతిపదికనే కాకుండా అవసరం ఆధారంగా టీకా అందించాలని తెలిపారు. కొవిడ్ను ఎదుర్కోనేందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలు, ఔషధాలు, మౌలిక వసతులను జీఎస్టీ నుంచి మినహాయించాలని సోనియా గాంధీ తన లేఖలో డిమాండ్ చేశారు.