జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి త్వరలో రాంచరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గౌతమ్ ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్తో బిజీగా ఉన్నాడు. అయితే రాంచరణ్కు ఓ కథ వినిపించగా..గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. శంకర్ సినిమాతోపాటు గౌతమ్ తిన్ననూరి సినిమాను చేస్తాడని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు గౌతమ్.
తాను నెక్ట్స్ స్క్రిప్ట్ ను ఇంకా సిద్దం చేయలేదని, ప్రస్తుతం చేస్తున్న సినిమా పనులతో బిజీగా ఉన్నానని చెప్పాడు. తన తర్వాత చిత్రంపై వస్తున్నవి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు. జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. మరోవైపు రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుతోపాటు ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు.
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్లోకి వరుణ్తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్