నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 3 : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల ని నర్సంపేట ఎక్సైజ్ సీఐ రాజసమ్మయ్య అన్నారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యసనాలకు అలవాటు పడిన వారికి కుటుంబ సభ్యులతో ప్రేమానుబంధాలు తగ్గిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఎవరైనా గంజాయి పండించినా, డ్రగ్స్ అమ్మినా వెంటనే టోల్ఫ్రీ నంబర్ 18004252523కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సైలు రాజేశ్వరి, రాధాకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ లోక్నాథ్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సతీశ్, మేనేజ్మెంట్ శంకర్రెడ్డి, అధ్యాపకులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖిలావరంగల్ ఎక్సైజ్ సీఐ బీ చంద్రమోహన్ హెచ్చరించారు. ఎక్సైజ్ స్టేషన్లో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు, సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. బార్ అండ్ రెస్టారెంట్లలో గంజాయితో పాటు మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి సీజ్ చేస్తామన్నారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తే 9440902651 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు.
కరీమాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ రమేశ్ కోరారు. గణేష్నగర్లో సీసీ కెమెరాల ఏర్పాటు, మత్తు పదార్థాలు, గుట్కాలు తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారన్నారు. ప్రజల సహకారంతోనే నేరాలను అదుపు చేయొచ్చన్నారు. సామాన్యులకే ఫ్రెండ్లీ పోలీస్ అని నేరస్తులకు కాదన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారికి శిక్ష తప్పదన్నారు.
నర్సంపేట రూరల్ : మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం గుడుంబా, గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్ తెలిపారు. సదస్సుకు ఎంపీటీసీలు, సర్పంచ్లు హాజరుకావాలని కోరారు. సీనియర్ అసిస్టెంట్ సంతోష్బాబు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.