సుబేదారి, మే17 : వరంగల్ పోలీసు కమిషనరేట్ భరోసా కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు బాగుందని సీపీ అంబర్ కిశోర్ ఝా ప్రశంసించారు. శుక్రవారం హనుమకొండలోని సీపీ కార్యాలయంలో భరోసా కేంద్రం అధికారులు, సిబ్బందికి ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కేంద్రం బాసటగా నిలుస్తోందన్నారు. ఈ మేరకు భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ అర్షం సువర్ణ, ఎస్సై శ్రావణి, సిబ్బంది నీరజ, నవ్య, సాగరిక, శ్రావణి, సుమలత, పవిత్ర, మౌనికను అభినందించారు.