తిరుపతి : తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam ) మూడో రోజు శనివారం గోవిందరాజస్వామి సింహ వాహనం (Simhavahanam) పై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం(Tirumanjanam) నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్సేవ ఘనంగా నిర్వహించారు. వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.