Nagarjuna Sagar Dam : స్వాతంత్ర దినోత్సవాన్ని పునస్కరించుకొని చారిత్రక కట్టడాలను విద్యుత్దీపాలతో అలంకరించడం చూస్తుంటాం. యావత్ భారతావనికి స్వేచ్ఛ లభించిన రోజున వారసత్వ భవనాలతో పాటు జాతి సంపద అయిన ప్రాజెక్టులు కూడా మువ్వన్నెల కాంతులతో జిగేల్మంటుంటాయి.
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాం (Nagarjuna Sagar Dam) సైతం విద్యుత్దీపాల సొబగులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారాలు శుక్రవారం డ్యాం గేట్లపై భాగంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ.. మూడు రంగుల లైట్లను అమర్చారు. రాత్రిపూట మూడు రంగుల్లో ప్రకాశిస్తున్న డ్యాం ఎంతో చూడముచ్చటగొలుపుతోంది.
మనదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 19555 డిసెంబర్ 10వ తేదీన నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ డ్యాం నుంచి అధికారికంగా నీళ్లను విడుదల చేశారు.