తాడ్వాయి, మే 17 : అంగన్వాడీ టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతోపాటు దోచుకున్న బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవీందర్ కేసు వివరాలను వెల్లడించారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన రడం సుజాత మండలంలోని కాటాపురం అంగన్వాడీ సెంటర్లో పదేళ్లుగా టీచర్గా పనిచేస్తున్నది. ఈ నెల 14న విధులకు హాజరై ఇంటికి వెళ్లే క్రమంలో బస్ మిస్సు కావడంతో బస్టాండ్లో వేచి ఉన్నది.
ఈ క్రమంలో ఆమెకు పరిచయం ఉన్న ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ఆకుదారి రామయ్య బైక్పై తాడ్వాయికి బయలుదేరింది. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ముందే పథకం పన్నిన రామయ్య అదే గ్రామానికి చెందిన పగిడి జంపయ్యను నీళ్ల ఒర్రె వద్ద దించి, ఆమె వద్దకు వెళ్లాడు. బైక్ నీళ్ల ఒర్రె వద్దకు రాగానే బైక్ను నిలిపివేసి సుజాతను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
మెడలో ఉన్న బంగారం తీసుకునేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో జంపయ్య మొదటగా బండరాయితో తలపై మోదాడు. రామయ్య ఆమె ఛాతిపై కూర్చొని గొంతు నులిమాడు. చనిపోలేదని భావించి స్కార్ప్ను మెడకు చుట్టి ఇద్దరు చెరోవైపు లాగి చంపేశారు. అనంతరం సెల్ఫోన్తోపాటు బ్యాగును పక్కనే ఉన్న వాగులో పడవేసి రొయ్యూరు గ్రామానికి వెళ్లిపోయినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
తాడ్వాయి, మే 17 : అంగన్వాడీ టీచర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతోపాటు దోచుకున్న బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవీందర్ కేసు వివరాలను వెల్లడించారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన రడం సుజాత మండలంలోని కాటాపురం అంగన్వాడీ సెంటర్లో పదేళ్లుగా టీచర్గా పనిచేస్తున్నది. ఈ నెల 14న విధులకు హాజరై ఇంటికి వెళ్లే క్రమంలో బస్ మిస్సు కావడంతో బస్టాండ్లో వేచి ఉన్నది.
ఈ క్రమంలో ఆమెకు పరిచయం ఉన్న ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ఆకుదారి రామయ్య బైక్పై తాడ్వాయికి బయలుదేరింది. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ముందే పథకం పన్నిన రామయ్య అదే గ్రామానికి చెందిన పగిడి జంపయ్యను నీళ్ల ఒర్రె వద్ద దించి, ఆమె వద్దకు వెళ్లాడు. బైక్ నీళ్ల ఒర్రె వద్దకు రాగానే బైక్ను నిలిపివేసి సుజాతను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
మెడలో ఉన్న బంగారం తీసుకునేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో జంపయ్య మొదటగా బండరాయితో తలపై మోదాడు. రామయ్య ఆమె ఛాతిపై కూర్చొని గొంతు నులిమాడు. చనిపోలేదని భావించి స్కార్ప్ను మెడకు చుట్టి ఇద్దరు చెరోవైపు లాగి చంపేశారు. అనంతరం సెల్ఫోన్తోపాటు బ్యాగును పక్కనే ఉన్న వాగులో పడవేసి రొయ్యూరు గ్రామానికి వెళ్లిపోయినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.