పోచమ్మమైదాన్ : వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశిధర్రావు, కో-ఆర్డినేటర్ డాక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. 2021-2022 సంవత్సరానికి గాను బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను తక్కువ ఖర్చుతో సీబీఎస్సీ సీస్టం ద్వారా స్టడీ మెటిరీయల్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యనందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతుల కోసం ఈ డిగ్రీ ఉపయోగపడుతుందని వివరించారు.
ఇందులో అడ్మిషన్లు పొందటానికి ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, రెండేళ్ల ప్రభుత్వ అనుమతి ఉన్న డిప్లామా కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులని, ఈ నెల 13 వరకు అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇతర వివరాలకు సెల్నెంబర్ 7382929618 సంప్రదించాలని కోరారు.