హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షల మేరకు పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ గ్యాదరింగ్ లేకుండా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఇంటింటికి తిరుగుతూ చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయి.
ఆపదలో ఉన్న అభాగ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడయ్యారని పేర్కొన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.