కరీమాబాద్ : రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఖిలావరంగల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎనుమాముల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు సెంటర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఖిలావరంగల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్దికి సహకరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, వైస్ చైర్మన్ సోల్తి భూమాత కార్పొరేటర్ జలగం అనిత డైరెక్టర్లు తోటకూరి నర్సయ్య, బండి బాబురావు, జూలూరి శ్రవణ్, ముప్ప సతీష్, బిల్ల హరీందర్, పిన్నింటి రాజేశ్వర్రావు, నోడల్ అధికారి నారాయణ, ఏఈవో సత్యప్రకాష్, సీఈఓ మైదం కుమాస్వామి, పీఏసీఎస్ సిబ్బంది దేవేందర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.