గూడూరు, మే 4: ‘అవ్వా.. నువ్ సల్లంగ ఉండాలె తల్లి.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటాం.. మాకు పింఛన్, మంచినీరు మంచిగ రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలె.. కేసీఆర్ సారే రావాలె’ ప్రజలు మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ దీవించారు. ఆమె శనివారం బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులతో కలిసి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గూడూరు, బొల్లేపల్లి, పొనుగోడు, అయోధ్యాపురం, మదనాపురం, గాజులగట్టు, బొద్దుగొండ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కొద్దిసేపు వారితో కలిసి పనిచేసి ముచ్చటించారు.
రైతుబంధు, పింఛన్ వస్తోందా?
పెంచిన పింఛన్ వస్తోందా అని కవిత కూలీలను ప్రశ్నించగా రాలేదని బదులిచ్చారు. అలాగే రైతుబంధు రావడం లేదని, కరెంట్ సరిగా ఉండటం లేదని, తాగునీటికి ఇబ్బందవుతోందని చెప్పుకొని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అబద్ధపు హామీలతో ప్రభుత్వం నడుస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు అమలు కాలేదని చెప్పారు. తనను మళ్లీ ఎంపీగా గెలిపిస్తే రాష్ర్టానికి రావాల్సిన నిధు లు, హక్కుల గురించి పోరాడుతానని అన్నారు. బొద్దుగొండలో కవితను ఓ కుటుంబం సన్మానించి అధిక మెజార్టీతో గెలువాలని దీవించింది. అలాగే గ్రామ యువత కవిత వెంట ఉంటామని మద్దతు తెలిపారు. అంతకుముందు గూడూరులోని ఓ సెంటర్లో కవిత స్వయంగా పూరీలు చేసి కస్టమర్లకు అందించారు. పార్టీ రాష్ట్ర నేత బీరవెల్లి భరత్కుమార్రెడ్డి, వైస్ ఎంపీపీ ఆరె వీరన్న, వేణుగోపాల్రెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం సంపత్రావు, ఉపాధ్యక్షుడు కాల్సాని వేణుమాధవ్రెడ్డి, దేవేంద్రచారి, యశ్పాల్రెడ్డి, సురేందర్, కఠార్సింగ్, రహీం, జిల్లా యాకయ్య, మోహన్, బోడ కిషన్, సుధాకర్రావు, సోమునాయక్, రవి, భీము డు, రణధీర్, రామన్న, నర్సింహ, గజ్జి యాకయ్య, స్టాలి న్, ఎలమందల రవీందర్, బోడ ఎల్లయ్య, యాదగిరి, అహ్మద్ పాల్గొన్నారు.