వరంగల్ చౌరస్తా : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. మొదటి సంవత్సరం వైద్యవిద్య పూర్తి చేసుకున్న 8 మంది విద్యార్ధులకు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గురువారం 193 మందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో 8మందికి పాజిటివ్గా తేలడంతో, నలుగురు విధ్యార్ధులను ఎంజీఎం కొవిడ్ 19 విభాగంలో చేర్చారు.
వారిలో ఒకరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులకు ఆక్సిజన్తో పాటుగా వెంటిలేటర్లు, మందులు అందుబాటులో ఉంచినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి తెలిపారు.
బాధితుల్లో ఏడుగురు విద్యార్ధులు రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడం అధికారులను, వైద్యులను ఆందోళనకు గురిచేస్తుందని, మరో వైద్య విధ్యార్ధి కరోనా వ్యాక్సిన్ తీసుకోనట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య తెలిపారు.
ఇదిలా ఉండగా వ్యాక్సిన్ తీసుకన్న వారు సైతం మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, సానిటేషన్ చేసుకోవడం లాంటి కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్