హైదరాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం పొంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పంచాయితీ పురస్కార్ సాధించిన సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును తెలంగాణ ఈ- ఆపరేటర్స్ అసోసియేషన్(TE-POA) బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వారి సమస్యలను మంత్రికి చెప్పగా వారు సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మడికొండ రాజ్ కుమార్, నాగి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ శానగొండ రమేష్ ఇతర జిల్లాల ఈ పంచాయితీ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు.