వరంగల్ : అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనులను నేడు సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు. గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తూ వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం ఎన్నడు కలలో కూడా ఊహించనిది నిజం చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలు చేసే ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్ర సత్యవతి నేడు వరంగల్లోని వైటీసి భవనంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అభివృద్ధి అంటే ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడం, పెన్షన్లు ఇవ్వడమే కాదు. ప్రతి కుటుంబం తమ కాళ్ల మీద తాము నిలబడుతూ మరో పదిమందికి ఉపాధి కల్పించేలా ఎదగేలా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.
ముఖ్యమంత్రి లక్ష్య సాధనలో భాగంగా నేడు గిరిజన సంక్షేమ శాఖ చాలా చురుకుగా పనిచేస్తుందన్నారు. గిరిజన సంక్షేమ శాఖలోని పథకాలు లబ్ధిదారులకు సమర్థవంతంగా అందజేసేందుకు ఈ శాఖ ఉద్యోగులందరికీ శిక్షణ ఇచ్చామన్నారు.
గిరిజనులను సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం ద్వారా పారిశ్రామికవేత్తలుగా మారుస్తూ…అంతటితో ఆగకుండా గిరిజన మహిళలను కూడా పారిశ్రామికవేత్తలు చేసేందకు వి-హబ్ ద్వారా ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, వి.హబ్ సీఈఓ దీప్తి రావుల, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం