వనపర్తి : రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండలం కాశీంనగర్లో రైతువేదికను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాంప్రదాయ పంటలు రైతులు వదిలేయాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండించాలి.
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల పరిశీలనకు మార్కెటింగ్ శాఖ తరపున సర్వే చేస్తామన్నారు. రైతులు రాజులు కావలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతు కష్టానికి గిట్టుబాటు ధర దక్కాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందన్నారు. ఆరున్నరేండ్లలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందని మంత్రి తెలిపారు.