హైదరాబాద్ : కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభింప జేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యమైంది.
అతి త్వరలో కార్యాలయాన్ని పూర్తి చేసి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రజలు జాగ్రత్తగా వుండాలని మంత్రి సూచించారు. మాస్కులు ధరిస్తూ..భౌతిక దూరం పాటిస్తూ..తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని అరికడుదామన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
ముంబై vs బెంగళూరు.. తుది జట్లు ఇవే!