చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్కు మరికొద్ది గంటల్లోనే తెర లేవబోతోంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు బరిలోకి దిగబోయే తుది జట్లు, చిదంబరం స్టేడియంలో రెండు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ముంబైపై బెంగళూరు రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. అదే సమయంలో చిదంబరం స్టేడియంలో గత ఐదు మ్యాచ్ల రికార్డు కోహ్లికి అస్సలు మింగుడుపడనిదే. ఇప్పటి వరకూ ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ 29 మ్యాచ్లు ఆడగా.. ముంబై 19, బెంగళూరు 10 గెలిచింది. ఇక చిదంబరం స్టేడియంలో ఆడిన చివరి ఐదు మ్యాచ్లనూ ముంబై ఇండియన్స్ గెలవగా, ఆర్సీబీ అన్నింట్లోనూ ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, క్రిస్ లిన్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్డిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నె/ మార్కో జాన్సెన్, రాహుల్ చహర్/ పియూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
ఆర్సీబీ తుది జట్టు (అంచనా): దేవ్దత్ పడిక్కల్, కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్వెల్, అజారుద్దీన్, డేనియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జేమీసన్, నవ్దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్
ఇవి కూడా చదవండి
భయం లేదు.. రైళ్లు కొనసాగుతాయి!
యూఎస్ నేవీ దుస్సాహసం.. భారత జలాల్లో ఆపరేషన్
మహమ్మారి వెంటాడినా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!