న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా, లాక్డౌన్ భయాలు వెంటాడుతున్నా.. రైళ్లు మాత్రం కొనసాగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. రైళ్లను ఆపడం లేదా తగ్గించే ఆలోచన ఏదీ లేదని ఆయన చెప్పారు. ప్రయాణించాలనుకున్న వాళ్లకు రైళ్ల కొరత లేదని కూడా సునీత్ తెలిపారు.
ఈ సమయంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ సాధారణంగానే ఉందని, క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఇక రైళ్లలో ప్రయాణించడానికి కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ కూడా అవసరం లేదని సునీత్ స్పష్టం చేశారు. కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికులు సంఖ్య పెరుగుతోంది. లాక్డౌన్ భయాలతో ముందే చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యూఎస్ నేవీ దుస్సాహసం.. భారత జలాల్లో ఆపరేషన్
మహమ్మారి వెంటాడినా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!