హాంగ్జౌ: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. యువ షూటర్ సైన్యమ్ విజ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం గెలిచి ఈ టోర్నీలో దేశానికి తొలిపతకాన్ని అందించింది.
శుక్రవారం జరిగిన ఫైనల్లో ఈ చండీగఢ్ అమ్మాయి.. 243.4 పాయింట్లతో సిల్వర్ నెగ్గింది. చైనా షూటర్ కిన్ఝన్ (243.6) స్వర్ణం గెలుచుకోగా 221 పాయింట్లతో రొస్తమియాన్ (ఇరాన్) కాంస్యం సాధించింది. 0.2 పాయింట్ల తేడాతో విజ్ స్వర్ణం కోల్పోవడం గమనార్హం.