మహబూబ్ నగర్ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ గురించి జిల్లా పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బయటకు వచ్చేవారు కచ్చితంగా మాస్క్ ధరించాలని ఆయా చౌరస్తాలలో పోలీసు అధికారులు ప్రచారం చేస్తున్నారు. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు ప్రజలందరూ చట్టాలకు లోబడి బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి నిర్మూలనకై ప్రభుత్వ ఆదేశాల మేరకు మనందరం కలిసి పని చేద్దామని విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చేవారు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం అవసరమని, నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి