హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్ 3 అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలలో ఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కించిన అనీల్ రావిపూడి ఇప్పుడు ఎఫ్ 3 కూడా వారితోనే రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఐదు హిట్లతో జోష్ మీదున్న అనీల్ ఈ సినిమాతో ఆరో హిట్ అందుకొని డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టేసాడు నిర్మాత దిల్ రాజు. ఆగస్ట్ 27న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించారు.
కరోనా సెకండ్ వేవ్ వనల అన్ని ప్లానింగ్స్ మారిపోయాయి. మళ్లీ థియేటర్స్ మూతపడడం వలన గతంలో రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. తాజాగా ఎఫ్ 3 చిత్రం కూడా వాయిదా వేయనున్నట్టు ప్రకటించారు అనీల్ రావిపూడి. కరోనా సెకండ్ వేవ్ వలన చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. మా మూవీ కూడా వాయిదా వేస్తున్నాం. కొత్త డేట్ అనుకున్నాక మళ్లీ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని అనీల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనీల్.. బాలకృష్ణ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు.