న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో భాగంగా భారత్ను ఆదుకునేందుకు విదేశాలు విరాళంగా పంపిన వైద్య సామగ్రి సరఫరాలో పారదర్శకత లోపించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ ఆరోపించారు. భారత్కు ఏయే వైద్య పరికరాలు చేరాయి? అవి ఎక్కడున్నాయి? వాటిని రాష్ర్టాలకు ఎలా కేటాయిస్తున్నారు? దీనిపై పారదర్శకత ఏది? అని కేంద్రాన్ని నిలదీశారు. కొవిడ్-19 విదేశీ సాయానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణలో మోదీ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు.