న్యూఢిల్లీ, మే 5: తాము రూపొందించిన యాంటీబాడీ కాక్టైల్ను (కాసిరివిమాబ్, ఇండెవిమాబ్ మిశ్రమాన్ని) కొవిడ్ చికిత్సలో వాడేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసినట్టు రోష్ ఇండియా ఔషధ సంస్థ వెల్లడించింది. విదేశాల్లో ఉత్పత్తయ్యే ఈ ఔషధాన్ని దిగుమతి చేసుకుని సిప్లా సంస్థతో కలిసి భారత్లో పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. తేలికపాటి, మధ్యస్త లక్షణాలున్న వారికి ఈ మందును వాడుతారు. దేశంలో వైద్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు సహకారం అందిస్తామని రోష్ ఇండియా తెలిపింది.