న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకున్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టీకా వేసుకున్న 113 మంది ఆరోగ్య సిబ్బందిపై చేసిన అధ్యయనంలో 18 మందికి (15.9 శాతం) కొవిడ్-19 పాజిటివ్గా తేలిందని ఢిల్లీలోని ఫోర్టీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ ఫర్ డయాబెట్స్ ఫౌండేషన్ పరిశోధకులు తెలిపారు. వలంటీర్లలో 107 మంది రెండు డోసులు, మిగిలిన వారు ఒక డోసు టీకా వేసుకున్నట్టు పేర్కొన్నారు. వైరస్ నిర్ధారణ అయిన 18 మందిలో ఒకరికి దవాఖాన చికిత్స అవసరమైందని, మిగిలినవారిలో స్పల్ప లక్షణాలున్నాయని తెలిపారు.