జైపూర్, మే 5: కరోనా విలయంతో దేశంలో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆత్మీయులను కోల్పోయి ఎంతోమంది కుమిలిపోతున్నారు. కరోనాతో తండ్రి మృతిని జీర్ణించుకోలేని ఓ కూతురు తండ్రి చితి మంటల్లోకి దూకింది. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్లోని బార్మెర్లో చోటుచేసుకున్నట్టు బుధవారం పోలీసులు తెలిపారు. మృతుడు దామోదర్దాస్ శర్దా (73)కు ముగ్గురు కూతుళ్లని, చిన్న కూతురైన చంద్ర శర్దా (34) మంటల్లో దూకింది. బాధితురాలి శరీరం 70శాతం కాలిపోవడంతో దవాఖానకు తరలించారు.