పరిగి, జనవరి 25: క్రీడాకారులలో దాగివున్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి టోర్న మెంట్లు వేదికలుగా నిలుస్తాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గోవిందాపూర్ సుజాతమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం జరిగిన బహుమతుల ప్రదా నోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లలు కీడా రం గం వైపు శ్రద్ధ చూపించే విధంగా, క్రీడలలో పాల్గొనేలా చేసేందుకు సర్కారు త్వరలోనే కొత్త క్రీడా పాలసీని తీసుకురాబోతుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులకు అందజేసే ప్రోత్సాహకాలు గణనీయంగా పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న ‘ఊరు-మన బడి’కార్యక్రమంతో సర్కారు బడుల రూపురేఖలు మారనున్నాయని, అలాగే కొత్త క్రీడా పాలసీతో రాష్ట్రం క్రీడా కారులకు స్వర్గధామంగా మారుతుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణగౌడ్ మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు గెలుపోటములను క్రీడా స్పూర్తితో తీసుకోవాలని చెప్పారు. క్రీడల నిర్వహణ ద్వారా క్రీడాకారుల మధ్య స్నేహబంధాలు పెం పొందుతాయని అన్నారు. ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన ప్రెస్ ఎలెవన్ జట్టుకు రూ. 30వేలు నగదు, ట్రోఫీ, రన్నరప్గా నిలిచిన గడిసింగాపూర్ జట్టుకు రూ.15వేలు నగదు, బహుమతులను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, మాజీ ఎంఈవో జనార్దన్రెడ్డి, ఆర్బీసీ ఎండీ శ్రీనివాస్రెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు జి.అశోక్వర్దన్రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ పి.వెంకట్రాంరెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.