బీసీ కులాలను అణచివేతకు గురిచేస్తున్న రాజకీయ పార్టీలకు ఓటు వేసే విషయంలో బీసీలంతా ఆలోచన చేయాలని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. ఎన్నో ఏండ్లుగా కులహంకారంతో ఆధిపత్య వర్గాలు కుట్ర చేసి బీసీ వర్గాలు ఏకం కాకుండా ప్రయత్నం చేస్తున్నాయని మండిపడుతున్నారు. చేవెళ్ల లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత ఒకరు బీసీలను చిన్నచూపు చూస్తూ చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమేనని నేతలు చెబుతున్నారు.
అన్ని బీసీ వర్గాలు ఏకమైతే తమకు అధికారం దూరమవుతుందనే భయం కాంగ్రెస్ పార్టీ నేతలకు పట్టుకోవడం వల్లనే ఈ తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. అటువంటి నేతలు అధికారంలోకి రాకుండా బీసీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నేతలు సూచిస్తున్నారు. చేవెళ్ల లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు బీసీలంతా క్రియాశీలకంగా పనిచేయాలని కోరుతున్నారు. చేవెళ్ల ఎన్నికతోనే బీసీ కులాలు రాజ్యాధికారానికి పునాది వేసుకోవాలని బీసీ నేతలు పిలుపునిస్తున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు వెనుకబడిన కులాల అభివృద్ధికి మలుపు. బడుగు, బలహీన వర్గాల గొంతుకైన జ్ఞానేశ్వర్ను ఎంపీగా గెలిపించుకుంటే చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వెనుకబడిన వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు అభివృద్ధి సాధిస్తాయి. అందుకు అన్ని కులమతాల ప్రజలు పార్టీలకు అతీతంగా కాసానిని గెలిపించాలి.
– వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, తాండూరు
96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయం. ఎవరెన్ని కుట్రలు చేసినా, మోసాలు చేసినా చేవెళ్ల గడ్డపై కచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. బీసీల ముద్దు బిడ్డ కాసాని భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తారు. బీసీల కోసం అనేక ఉద్యమాలు చేసిన జ్ఞానేశ్వర్కు బీసీల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.
– ఉమాశంకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, తాండూరు
రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. పార్లమెంట్లో ముదిరాజ్లకు సంబంధించిన బాధలు, అమలుచేయాల్సిన చట్టపరమైన విషయాలు కాసానికి తెలుసు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఆయన చేసిన సేవలు ఎనలేనివి. జనరల్ సీట్లో పార్లమెంట్ స్థానాన్ని ముదిరాజ్ బిడ్డ పోటీ చేయడం చాలా అనందంగా ఉన్నది.
– మాణెయ్య, బీఆర్ఎస్ బీసీ సెల్ ముదిరాజ్ నవాబుపేట మండల అధ్యక్షుడు
ఓటు బ్యాంకుగా వాడుకునే రాజకీయ పార్టీల మాటలు నమ్మి మోసపోకుండా బీసీలమంతా ఈసారి ఐక్యతతో ముందుకు వెళ్తాం. బీసీలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీలను గత ప్రభుత్వాలు జనరల్ సీట్లలో నిలిపిన సందర్భాలు లేవు. ప్రస్తుతం జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు ఓటు వేసి గెలిపిద్దాం.
– వెంకటేశ్ ముదిరాజ్, నవాబుపేట
బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపీగా గెలిపిస్తే బీసీల గొంతును పార్లమెంట్లో వినిపిస్తారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి కాసాని గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గత 40 ఏండ్లుగా పోరాటం చేస్తూ, 96 బీసీ కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత కాసానికే దక్కుతుంది. చేవెళ్ల గడ్డపై బీసీ నేతకు ఎంపీ బరిలో నిలిచే అవకాశం కల్పించిన కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– కమ్మరి శ్రీనివాస్, బీసీ నేత, షాబాద్
బీసీలంతా ఒక్కటై ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నేత కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు సక్రమంగా సీట్లు కేటాయించకుండా మోసం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీలను గుర్తించి 50 శాతం ఎంపీ సీట్లు బీసీలకు కేటాయించడం గొప్ప పరిణామం. చేవెళ్ల గడ్డపై బీసీ నేతకు అవకాశం రావడం సంతోషకరం.
– సురేశ్ముదిరాజ్, షాబాద్
చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్కు బీసీలందరూ ఏకతాటిపై వచ్చి గెలిపించుకోవాలి. గతంలో కేసీఆర్ రంజిత్రెడ్డికి, విశ్వేశ్వర్రెడ్డిలను నమ్మి టికెట్ ఇచ్చి గెలిపిస్తే వారు స్వలాభం కోసం పార్టీలు మారారు. అలాంటివారిని మళ్లీ గెలిపిస్తే బీసీలకు న్యాయం జరుగదు. బీసీల సమస్యలపై ఒక బీసీ నాయకుడు మాత్రమే పోరాడుతాడు తప్ప ఇతరులు పోరాడరు.
– వల్లూరి రమేశ్, ఆర్కేపురం
బీసీల ఓట్లను కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్కు వేసి బీసీల సత్తా ఏంటో చూపుదాం. కాంగ్రెస్, బీజేపీ చేవెళ్లలో అగ్రవర్ణ నాయకులకు టికేట్ ఇచ్చింది. కేసీఆర్ ఒక బీసీ నాయకుడైన జ్ఞానేశ్వర్కు టికెట్ కేటాయించి బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. కాసానిని గెలిపిస్తే సామాజికంగా బీసీలకు న్యాయం జరుగుతుంది.
– సిద్దగోని వెంకటేశ్గౌడ్, ఆర్కేపురం
వెనుకబడిన వర్గాల ఐక్యతపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు సరైనవి కావు. ఏండ్ల తరబడి బీసీ వర్గాలను రాజకీయపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయి. చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీ బిడ్డ కాసానికి ఇవ్వడం ద్వారా ఈ వర్గాల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ ఎన్నికల్లో జ్ఞానేశ్వర్నుఅధిక మెజార్టీతో గెలిపించుకుని బీసీల శక్తిని చాటుతాం.
– మోహన్ ముదిరాజ్, మియాపూర్
రాజకీయ సామాజిక సమానత్వం కోసం వెనుకబడిన వర్గాలు క్రియాశీలక పోరాటాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాయి. బీసీలు ఎల్లప్పుడూ ఐక్యతతోనే తమ సంక్షేమం కోసం పోరు చేస్తున్నాయి. ఇట్లాంటి సమయాల్లో బీసీల ఐక్యత పట్ల కాంగ్రెస్ నేతలు అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. చేవెళ్లలో బీసీ బిడ్డ కాసానికి ఓటు వేసి గెలిపించి పార్లమెంటుకు పంపుదాం.
– చంద్రమోహన్ సాగర్, బీసీ సెల్ అధ్యక్షుడు, మియాపూర్
బీసీలంతా ఐకమత్యంగా ఉన్నప్పుడే లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్ నాయకులు బీసీల పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణం. ఇలాంటివారికి ఓటు హక్కు, ఐక్యతతోనే తగిన గుణపాఠం నేర్పించాలి. చేవెళ్లలో బీసీల ముద్దుబిడ్డ, ఉద్యమ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
– రఘుముదిరాజ్, మైలార్దేవ్పల్లి
అన్ని వర్గాల ప్రజలకు కాసాని జ్ఞానేశ్వర్ అండగా ఉంటారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. గతంలో ఉద్యమ సమయంలోనూ ఆయన తనదైన శైలిలో ఉద్యమించి హక్కుల కోసం పోరాడారు. రాజకీయాలకతీతంగా బీసీలు సిద్ధమై బీసీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలి.
– కొండల్ముదిరాజ్, కాటేదాన్
రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్కు పట్టం కడుతాం. కాసాని పరిగి నియోజకవర్గానికి మంచి పరిచయమున్న నాయకుడు. బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే జ్ఞానేశ్వర్కు ప్రజలు పట్టం కట్టాలి. ఇతర పార్టీలకు చెందిన నాయకులను గతంలో గెలిపించినా ఎప్పుడూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదు.
– మందిపల్ వెంకట్, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి, కులకచర్ల
బీసీలకు న్యాయం జరుగాలంటే బీసీ అభ్యర్థితోనే సాధ్యం అవుతుంది. చాలా ఏండ్ల నుంచి చేవెళ్ల పార్లమెంటు నుంచి బీసీలకు ఏ పార్టీలు అవకాశం ఇవ్వలేదు. కాని బీఆర్ఎస్ అధినేత కాసాని జ్ఞానేశ్వర్కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని బీసీలు సద్వినియోగం చేసుకొని బీసీల సత్తా ఏంటో నిరూపించాలి.
– చాకలి అంజిలయ్య, మాజీ సర్పంచ్, బొంరెడ్డిపల్లి, కులకచర్ల మండలం