పరిగి, మే 25: కరోనా కట్టడికి ప్రభుత్వం అమలుచేస్తు న్న లాక్డౌన్ను పరిగిలో కట్టుదిట్టంగా కొనసాగిస్తున్నా రు. ఉదయం 10 గంటల నుంచి పకడ్బందీగా లాక్డౌ న్ అమలుచేస్తున్నారు. రోడ్డుపై తిరుగుతున్న ప్రతి వాహ నాన్ని పోలీసులు తనిఖీలు చేసి, పాస్ల్లేని వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. తద్వారా రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పరిగి పట్టణ శివార్లలో హైదరాబాద్, వికారాబాద్ రూట్లలో పోలీసులు ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్ఐ క్రాంతికుమార్లు వాహనాలు తనిఖీ చేశారు.
కరోనా కట్టడిలో పోలీసుల సేవలు భేష్
కరోనా కట్టడిలో పోలీసుల సేవలు గొప్పవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని అనురాగ్ డెవలపర్స్ సౌజన్యంతో సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందికి బిర్యానీ ప్యాకెట్లను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ అమ లు చేస్తున్నదని, పోలీసులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని అన్నారు. పోలీసులకు సహకరించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పరిగి సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఏ.గోపాల్, అనురాగ్ డెవలపర్స్ ప్రతినిధులు రతన్జీ, ఆరిఫ్ పాష, మధు పాల్గొన్నారు.
పెద్దేముల్లో..
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని తాండూరు రూరల్ సీఐ జలెందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మంబాపూర్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టును పరిశీలించి, పలు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నిర్మూలనకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను కఠినంగా అమలుచేస్తున్నామని, 10 గంటలు దాటిన తరువాత ఎవరూ బయట తిరగరాదని సూచించారు. ఎవరైనా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై డిజాస్టర్ మెనేజ్మెంట్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఎస్ఐ నారాయణ, కానిస్టేబుళ్లు బల్వంత్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొవిడ్ బాధితులకు పండ్లు, శానిటైజర్లు పంపిణీ
కొవిడ్ బాధితులకు పండ్లు, శానిటైజర్లు, మాస్కులను మంగళవారం ఏఆర్ కానిస్టేబుల్ లక్ష్మీనరసింహగౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ సత్తయ్యగౌడ్ పంపిణీ చేశారు. మంగళవారం మండలంలోని దిర్సంపల్లిలో కొవిడ్ బాధితులకు పండ్లు, శానిటైజర్లు, మాస్కులను వైద్య సిబ్బంది ఏఎన్ఎం, ఆశ వర్కర్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రమీల, ఆశ వర్కర్లు పద్దాన, అతియ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ
కరోనా కట్టడిలో భాగంగా తాండూరు రూరల్ పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్ను పెద్దేముల్ జడ్పీటీసీ ధారాసింగ్ మంగళవారం పంపిణీ చేశారు. రూరల్ సీఐ జలెందర్రెడ్డితోపాటు కరణ్కోట, తాండూరు టౌన్, యాలాల, బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహించే ఎస్సైలతోపాటు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ను అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు రవిశంకర్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా బాధితులకు సాయం
ఇప్పాయిపల్లిలో కొవిడ్ బాధితులకు కులకచర్ల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం కోడిగుడ్లు, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కడంపల్లి రఘు, రాములు, మల్లేశ్, ఎల్లయ్య, కృష్ణయ్య, చంద్రయ్య, ఎర్రం రాములు, ఆశవర్కర్ మంజుల, గ్రామస్తులు చాకలి బాలయ్య, కృష్ణయ్య, జానయ్య, చెన్నయ్య, మెరుగు కృష్ణయ్య పాల్గొన్నారు. కొవిడ్తో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ విఠల్రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో బాలల హక్కుల సంరక్షణాధికారి ఆంజనేయులు, చైల్డ్లైన్ ప్రతినిధి రామచంద్రయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.