ఆర్కేపురం : చేవెళ్ల ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ను ఆదరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) కోరారు. సీపీఐ మాజీ నాయకుడు, మీర్పేట్ మాజీ సర్పంచ్ ఆర్.గోపాల్ బీఆర్ఎస్ అభ్యర్ధి కి మద్దతుగా సరూర్నగర్ డివిజన్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
జాతీయ పార్టీల గెలుపుతో తెలంగాణ (Telangana) కు ఎటువంటి న్యాయం జరగదని అన్నారు. బీఆర్ఎస్ (BRS) ను గెలిపిస్తేనే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి అధిక నిధులు రాబట్టుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా గ్యారంటీల (Gurantees) అమలులో విఫలమైందన్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే మనల్ని నట్టేట ముంచుతాయని పేర్కొన్నారు.
అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు. ప్రజా వ్యతిరే విధానాలకు పాల్పడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే గ్యాస్(Gas), పెట్రోల్(Petrol), డీజిల్తోపాటు నిత్యవసరాల సరుకుల ధరలను పెంచుతారని పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ , నాయకులు ఇంటూరి అంకిరెడ్డి, ఆకుల అరవింద్ కుమార్, లోకసాని కొండల్రెడ్డి, ధర్పల్లి అశోక్, రిషి తదితరులు పాల్గొన్నారు.