Uttam Kumar Reddy | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పా రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటే తాము ప్రస్తుతం నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని పేర్కొన్నారు. గాంధీభవన్లో గురువారం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం గా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు వచ్చిందని, కరెంటు పోతున్నదంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఖండించారు.
తడిసిన ధాన్యా న్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హా మీ ఇచ్చారు. ఎన్నికలు ముగిశాక అర్హులైన వారికి రేషన్కార్డులు, ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీలేదని, ఆ పార్టీ తమకు మూడు స్థానాల్లోనే పోటీ ఇస్తున్నదని పేర్కొన్నారు.