నందిగామ : తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడలో మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ మరిన్ని మంచి సంక్షేమ ఫథకాలను ప్రవేశపెట్టనుందని తెలిపారు.
కావలి కృష్ణయ్య, అంజయ్య, నర్సింలు, బీమయ్య, నరేశ్, లింగమయ్య, శ్రీనివాస్, మల్లేష్, రవి, మల్లేష్, సత్యనారాయణ, కిష్టయ్య, శ్రీకాంత్, మధు, మహేష్, అనిల్కుమార్, హేమంత్, ముఖేశ్యాదవ్, శివకుమార్, సిద్ధయ్య, శంకరయ్య, సుందర్, సురేష్, వెంకటేష్లతో పాటు మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే టీఆర్ఎస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైఎస్ చైర్మన్ ఈట గణేశ్, రాష్ట్ర నాయకురాలు రాజ్యలక్ష్మీ, పార్టీ మండలాధ్యక్షుడు పద్మారెడ్డి, నందిగామ సర్పంచ్ వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, ఉపసర్పంచ్ శేఖర్, నాయకులు సుదర్శన్గౌడ్, జంగిలి కుమార్, సురేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు.