బొంరాస్పేట : చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాందార్పూర్లో జరిగింది. గౌరారం గ్రామానికి చెందిన పద్మప్ప (60)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం నాందార్పూర్ గ్రామానికి సమీపంలోని చెరువులో పద్మప్ప మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటనారాయణ తెలిపారు.