హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ యావ త్తు నిమగ్నమైన నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు.
జిల్లా పార్టీ కార్యవర్గంతోపాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిం చి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు కృషి చేసిందని వివరించారు. తెలంగాణభవన్లో ఉదయం 9 గంటలకు పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.