ప్రేమకు చావు లేదంటారు కదా.. అది నిజమే కాబోలు అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. అప్పుడెప్పుడో 35 ఏళ్ల కింద ఓ ప్రేమ జంట విడిపోయింది. 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు కలిసింది. కలవడమే కాదు.. ఆ జంట ఇప్పుడు పెళ్లి చేసుకొని స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్లో చోటు చేసుకుంది.
హసన్ జిల్లాలోని దేవరముద్దనహళ్లికి చెందిన చిక్కన్న అదే గ్రామానికి చెందిన జయమ్మను 35 ఏళ్ల క్రితం ప్రేమించాడు. ఇద్దరికి ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం. కానీ.. జయమ్మ ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. చిక్కన్న కూలీ పని చేసే వ్యక్తి అని అతడికి తమ కూతురును ఇవ్వడానికి జయమ్మ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినా.. జయమ్మ అదే గ్రామంలో ఉండేది. తన తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం పెట్టింది.
దీంతో జయమ్మను చూసి భరించలేక.. చిక్కన్న మైసూర్ దగ్గర్లోని మెటగల్లికి వెళ్లిపోయాడు. అక్కడే కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జయమ్మ పెళ్లి చేసుకున్నా ఒక కొడుకుకు జన్మనిచ్చినా.. చిక్కన్న మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. ఒంటరిగా తన జీవనాన్ని సాగిస్తూ వచ్చాడు. అయితే.. ఎప్పటికప్పుడు జయమ్మ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండేవాడు చిక్కన్న.
కొన్నేళ్ల తర్వాత జయమ్మను తన భర్త వదిలేశాడు. దీంతో ఆ ఊళ్లో ఉండలేక ఏదైనా పనికోసం అని జయమ్మ కొడుకుతో సహా మైసూర్ వచ్చేసింది. జయమ్మ మైసూర్ వచ్చిందని.. తన భర్త వదిలేశాడని తెలుసుకున్న చిక్కన్న.. 35 ఏళ్ల తర్వాత తనను కలిశాడు. చిక్కన్న ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోలేదని జయమ్మకు కూడా తెలిసింది. దీంతో 35 ఏళ్ల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
చివరకు ఇద్దరూ మెలుకొటెలోని శ్రీచెలువ నారాయణ స్వామి టెంపుల్లో ఒక్కటయ్యారు. 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. ముందు ఈ విషయం జయమ్మ కొడుకుకు కూడా తెలియదు. అతడు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. 35 ఏళ్ల తర్వాత ప్రేమజంట పెళ్లి చేసుకోవడం గురించి కర్ణాటకలో వైరల్ కావడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. జయమ్మ కొడుకును తన కొడుకుగా ఒప్పుకొని.. జయమ్మ మెడలో మూడు ముళ్లు వేసి.. 35 ఏళ్ల తన నిరీక్షణకు చిక్కన్న ఎట్టకేలకు ముగింపు పలికాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
1496 వాషింగ్ మిషన్లతో పిరమిడ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.. ఎందుకో తెలుసా?
King Cobra: బెదిరిపోయి వంటింట్లో జొరబడ్డ కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Hyderabad | లాక్డౌన్ టైమ్లో ప్రాణాలకు తెగించి సేవలందించారు.. నోబెల్కు నామినేట్ అయ్యారు
హైదరాబాద్లో బడ్జెట్ ధరలో టేస్టీ దోశ, ఇడ్లీ తినాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం అదే.. పారిస్ కూడా దాని తర్వాతే!