కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు ఎవ్వరూ బయటికి వెళ్లలేదు. చివరకు నిత్యావసర సరుకుల కోసం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు బయటికి వెళ్లి మెడిసిన్ తెచ్చుకోవడం కోసం కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ సమయంలో దేశంలోని కొన్ని సిటీలలో సైకిల్ వాలంటీర్లు సేవలందించారు. అత్యవసరమైనవి ఇంటికెళ్లి మరీ ప్రజలకు అందించారు. మెడిసిన్, కిరాణా సరుకులు, ఇతర ముఖ్యమైనవన్నింటినీ చేరవేశారు. హైదరాబాద్లో కూడా రెండు సార్లు లాక్డౌన్ విధించిన సమయంలో ప్రజలను ఆదుకున్నది వీళ్లే.
అయితే.. అసలు వీళ్లు ఎవరు? వీళ్లు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా సైకిల్ తొక్కుతూ ఎందుకు ప్రజలకు సమకూర్చారు అనే విషయాలను ప్రజలు పెద్దగా పట్టించుకోపోయినప్పటికీ.. వాళ్ల సర్వీస్కు, వాళ్ల మానవత్వానికి మాత్రం పెద్ద గుర్తింపే లభించింది. సైక్లింగ్ వాలంటీర్ల గ్రూప్ రిలీఫ్ రైడర్స్ ఇండియా(elief Riders India).. తాజాగా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది.
రిలీఫ్ రైడర్స్ గ్రూప్ను బెంగళూరుకు చెందిన సత్య శంకరన్ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ గ్రూప్ దేశంలోని 12 నగరాల్లో ఉంది. అందులో హైదరాబాద్ కూడా ఉంది.
సత్య బెంగళూరులో రిలీఫ్ రైడర్స్ గ్రూప్ను ప్రారంభించిన రెండుమూడు రోజులకే మేము ఇక్కడ హైదరాబాద్లో వింగ్ను ప్రారంభించాం. ఆ తర్వాత దేశంలోని 12 నగరాల్లో ఈ గ్రూప్ ప్రస్తుతం సేవలు అందిస్తోంది.. అని హైదరాబాద్లో ఈ గ్రూప్ను ప్రారంభించిన శంతన సెల్వన్ చెప్పుకొచ్చాడు.
ఇప్పటి వరకు దేశం మొత్తం మీద రిలీఫ్ ఇండియా గ్రూప్కు 750 మంది వాలంటీర్లు ఉన్నారట. కేవలం హైదరాబాద్లోనే 300 మంది వాలంటీర్లు ఉన్నారని సెల్వన్ తెలిపాడు. కరోనా సమయంలో కూడా మేమంతా సర్వీస్ చేశాం. ఇప్పటికీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఏ పని చేసినా.. ఎక్కడికి వెళ్లినా అంతా సైకిల్ మీదనే వెళ్తాం.. అని సెల్వన్ అన్నాడు.
నోబెల్ శాంతి బహుమతికి తమ గ్రూప్ను నామినేట్ చేయడంపై సెల్వన్ సంతోషం వ్యక్తం చేశాడు. మా వాలంటీర్లకు ఎప్పుడో అవార్డులు దక్కాయి. వాళ్లు చేసిన నిస్వార్థమైన సేవే వాళ్లకు అవార్డు. పాండమిక్ సమయంలో మేము చాలామంది వృద్ధులకు, లేవలేని స్థితిలో ఉన్నవాళ్లకు సాయం చేశాం. వాళ్ల నుంచి ఇప్పటికీ కాల్స్ వస్తుంటాయి. వాళ్ల ఆశీర్వాదాలే మాకు అవార్డులు. వాళ్ల మాటలు వింటే మున్ముందు ఇంకా సర్వీస్ చేయాలనిపిస్తుంటుంది.. అని చెప్పి సెల్వన్ భావోద్వేగానికి గురయ్యాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైదరాబాద్లో బడ్జెట్ ధరలో టేస్టీ దోశ, ఇడ్లీ తినాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం అదే.. పారిస్ కూడా దాని తర్వాతే!
మట్టితో ఇంటిని నిర్మించాడు.. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
డ్రైవర్లకు పోలీసుల ‘గరమ్ చాయ్’.. ఎందుకంటే?