ఇదంతా కాంక్రీట్ జంగల్. ప్రస్తుతం నిర్మించే బిల్డింగ్స్ అన్నీ సిమెంట్, ఇటుకలు, ఇనుప సువ్వలతో నిర్మించేవే. కానీ.. ఓ వ్యక్తి మాత్రం సిమెంట్ వాడకుండా.. ఇటుకలు వాడకుండా.. ఎలాంటి ఇనుసు సువ్వలు వాడకుండా.. కేవలం మట్టితో ఇల్లు నిర్మించి ఔరా అనిపించాడు. ఒకప్పుడు ఊళ్లలో మన తాతలు.. ఏ మట్టి ఇళ్లలో నివసించేవారో.. అటువంటి ఇంటిని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ మట్టి ఇల్లు కేరళలోని తిరువనంతపురంలో ఉంది.
సిలా సంతోష్ అనే శిల్పి ఈ ఇంటిని నిర్మించారు. 200 స్క్వైర్ ఫీట్లలో కేవలం మట్టితో ఈ ఇంటిని నిర్మించాడు. ఈ ఇల్లు ఎండాకాలంలో కూడా చాలా చల్లగా ఉంటుంది. ఎటువంటి ఫ్యాన్ అవసరం లేదు. ఇంట్లోకి దోమలు, చీమలు, కీటకాలు కూడా రావు. ఎందుకంటే.. ఇంటి కోసం తయారు చేసిన మట్టిలో.. ఆయుర్వేద, మూలిక మొక్కల ఆకులను, బెరడులను కలిపి.. ఆ ఇంటిని నిర్మించాడు సంతోష్.
ఎప్పటికీ కూల్గా ఉండేలా.. ఎప్పుడూ ఇంట్లో సువాసన వెదజల్లేలా ఇల్లు కట్టాలనేదే సంతోష్ లక్ష్యం. దాని కోసం చాలా రీసెర్చ్ చేశాడు. మట్టిలో పలు రకాల మూలికా మొక్కలతో చేసిన కషాయాన్ని మట్టిలో కలిపి ఇంటిని నిర్మించాడు.
మట్టి ఇంటిని నిర్మించడానికి సంతోష్కు ఒక సంవత్సరం పట్టింది. తన క్లోజ్ ఫ్రెండ్ జాకబ్ థంకాచన్ అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలోనే ఈ ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటి కోసం 65 రకాల మూలికా మొక్కలను ఉపయోగించాడు. ఎంత వేడి ఉన్నా.. ఆ ఇంట్లో మాత్రం ఎప్పటికీ చల్లగా ఉంటుంది. సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. ఫ్యాన్ అవసరమే లేదు.. అని సంతోష్ తెలిపాడు.
ఇక.. మట్టితో నిర్మించిన ఆ ఇంటిని చూడటానికి స్థానికులు క్యూ కడుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా.. అద్భుతమైన మట్టి ఇంటిని నిర్మించిన సంతోష్ను అక్కడి స్థానికులు మెచ్చుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రన్వేపై విమానం టైర్ పంక్చర్.. కిందికి దిగి పక్కకు నెట్టిన ప్రయాణికులు.. వైరల్ వీడియో
ఇది మాంసం అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. మరేంటో చెప్పుకోండి చూద్దాం
అత్యంత బిగ్గరగా త్రేన్పు తీసి గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు.. వైరల్ వీడియో
సెలూన్కు వెళ్లి గడ్డం గీయించుకున్న కోతి.. షాకైన కస్టమర్లు.. వైరల్ వీడియో