ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఇతర నేతలు.. ఏదైనా ఓపెనింగ్కు వెళ్లినప్పుడు ఖచ్చితంగా అక్కడ రిబ్బన్ కటింగ్ ఉంటుంది. ఆ ఈవెంట్కు వచ్చిన ముఖ్య అతిథితో రిబ్బన్ కట్ చేయించడం అలవాటుగా మారింది.
ఇలాగే.. ఓ ఈవెంట్లో రిబ్బన్ కటింగ్ కోసం వెళ్లిన ఓ మంత్రి ఏకంగా రిబ్బన్ను తన పళ్లతో కొరికి మరీ కట్ చేశాడు. ఈ ఘటన పాకిస్థాన్లో చోటు చేసుకుంది. పాకిస్థాన్ మంత్రి ఫయాజ్ ఉల్ హాసన్.. రావల్పిండిలో ఓ ఈవెంట్కు హాజరయ్యాడు. ఎలక్ట్రానిక్ షాప్ ఓపెనింగ్కు ఆయన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. అయితే.. రిబ్బన్ కట్ చేసేందుకు.. ఆయనకు కత్తెర ఇచ్చినా కూడా.. అది తుప్పు పట్టిపోవడంతో ఆ రిబ్బన్ అస్సలు కట్ కాలేదు. దీంతో చేసేందేం లేక.. తన పళ్లతో ఆ రిబ్బన్ను కట్ చేశాడు. తన పళ్లతో చేసిన రిబ్బన్ కట్ వీడియోను ఫయాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Sea Snake : వామ్మో.. సముద్రంలో పాములు ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
నెట్టింట్లో మిల్క్ క్రేట్ చాలెంజ్!
Viral Video : ద్యావుడా.. పుచ్చకాయలను ఇలాంటి పనులకు కూడా వాడుతారా?
Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్ డ్యాన్స్కు ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో
World’s Highest Movie Theatre : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేటర్.. ఇండియాలో ప్రారంభం