ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్.. తాజాగా గంజాయి స్కామ్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అమెజాన్ ద్వారా ఆన్లైన్లో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను మధ్యప్రదేశ్లోని భిండ్ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ల నుంచి 20 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
భిండ్లోని గ్వాలియర్ రోడ్కు చెందిన పవాయా, బ్రిజేంద్ర తోమర్.. ఇద్దరూ అమెజాన్ ఈ కామర్స్ సంస్థ ద్వారా గంజాయిని అమ్ముతున్నారు. అమెజాన్లో సెల్లర్గా రిజిస్టర్ చేసుకొని.. ఆన్లైన్లో గంజాయిని సరఫరా చేస్తున్నారు.
పవాయా.. ఏపీలోని విశాఖపట్టణం నుంచి గంజాయిని అమెజాన్ ద్వారా దేశంలోని గ్వాలియర్, భోపాల్, కోటా, ఆగ్రా లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఆ బిజినెస్లో బ్రిజేంద్ర సాయం చేస్తున్నాడు. ఆన్లైన్ ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్నారని తెలుసుకున్న మధ్య ప్రదేశ్ పోలీసులు ఆ రాకెట్ను ఛేదించారు.
అయితే.. ఒక పెద్ద ఈకామర్స్ సంస్థ అయి ఉండి.. ఇటువంటి గంజాయి సరఫరా రాకెట్లో చిక్కుకోవడం ఏంటని.. నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే దానికి గంజాయి కంపెనీ అనే పేరు కూడా పెట్టేశారు. మరికొందరు నెటిజన్లు.. ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ మీమ్స్ను మీరు కూడా చూసి కాసేపు నవ్వుకోండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బీరు గ్లాస్ ఎలా కిందపడిపోయిందో ఈ వీడియో చూసి చెప్పండి చూద్దాం
ఇదేందయ్యా ఇది.. జీవితంలో ఇటువంటి యాక్సిడెంట్ను ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో
వాట్ ఆన్ ఐడియా సర్జీ.. ట్రెయిన్లో ఈ వ్యక్తి చేసిన పనికి ప్రయాణికులు ఫిదా