ఏనుగులు ఎప్పుడు శాంతంగా ఉంటాయో.. ఎప్పుడు కోపంతో ఉంటాయో తెలియదు. వాటికి కోపం వస్తే మాత్రం తట్టుకోలేం. అవి చేసే పనులు మామూలుగా ఉండవు. రచ్చ రచ్చ చేస్తాయి. ఎంతమంది వాటిని ఆపాలని ప్రయత్నించినా అది కుదరదు. సేమ్ అలాంటి ఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది.
కేరళలోని త్రిస్సూర్లో ఉన్న తిరువిల్వామల విల్వాద్రినాద గుడిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గుడిలో కజ్చా సీవెలి అనే పండుగ జరుగుతోంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఏనుగు మీదికి గుడికే చెందిన స్టాఫ్ మెంబర్ ఒకతను ఎక్కి కూర్చున్నాడు. కాసేపు ఏనుగు బాగానే ఉంది కానీ.. తర్వాత ఏమైందో తెలియదు.. ఆ ఏనుగు తన తనను గట్టిగా ఊపడం ప్రారంభించింది. దీంతో దాని మీద కూర్చున్న వ్యక్తి కిందపడిపోయాడు. వెంటనే లేచి అక్కడి నుంచి దూరంగా పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న దీపారాధన చేసే వస్తువులను కూడా కింద పడేసింది. వెంటనే అక్కడున్న వాళ్లు ఏనుగును తాళ్లతో బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Photo : చిల్లర నాణేలతో సాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాడు.. ఆర్డర్ వచ్చాక చూసి షాక్
Pic of the Day : దేశీ జూగాడ్.. వాట్ ఆన్ ఐడియా సర్జీ.. వైరల్ ఫోటో
Ayyayyo Vadhamma: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. అంటున్న హైదరాబాద్ సిటీ పోలీసులు.. ఎందుకని?
Viral Video : ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే.. గాలిలో ప్రాణాలు కలిసిపోయేవి
Viral Video : నా లవర్ సినిమాకు రమ్మంటే వస్తలేదు అన్న.. అంటూ ఫోన్ను ఏం చేశాడో చూడండి
Ratan Tata : తాజ్ హెటల్ ఉద్యోగి చేసిన ఆ పనికి రతన్ టాటా ఫిదా.. ఫోటో వైరల్