నేటి జనరేషన్ యూత్ రొటీన్కు భిన్నంగా ఉండేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అందరితో కాకుండా.. అందరిలా కాకుండా.. ఒక్కరిగా ఉండాలని.. సరికొత్తగా ట్రై చేయాలని తెగ ఆరాటపడుతున్నారు. కొత్త కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. అందులో నుంచి పుట్టినవే టూర్, ట్రెక్కింగ్, సైక్లింగ్, బైక్ టూర్స్ లాంటివి.
సాధారణంగా బైక్ మీద ఓ 100 కిమీలు వెళ్లాలంటేనే చాలా ఆలోచిస్తాం. అటువంటిది హైదరాబాద్కు చెందిన ముచ్చింతల సాయిరాజ్ వంశీకర్ అనే 24 ఏళ్ల కుర్రాడు మాత్రం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3700 కిలోమీటర్లు నడిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోవడానికి వంశీకర్కు 75 రోజులు పట్టింది.
అది కూడా మామూలు నడక కాదు. ట్రెక్కింగ్.. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి వచ్చే దారిలో ఉన్న అన్ని పర్వాతాలను ట్రెక్కింగ్ చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించేవాడు. సెప్టెంబర్ 16న శ్రీనగర్లో లాల్ చౌక్లో తన ట్రెక్కింగ్ ప్రారంభించాడు వంశీకర్. నవంబర్ 28న కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ముగించాడు.
నాకు అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. అందుకే 2016 నుంచే ఇలాంటి అడ్వెంచర్లు చేయడం ప్రారంభించా. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 75 రోజుల్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడవాలని నిర్ణయించుకున్నా. నా ఈ జర్నీలో నేను చాలా ఎంజాయ్ చేశా. ప్రతి రోజు నాకు ఒక కొత్త రోజులా అనిపించేది.. అంటూ వంశీకర్ తెలిపాడు.
అయితే.. తన ట్రెక్కింగ్ ఏమీ.. రెడ్ కార్పెట్ కాలేదు. తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను దాటుకోవాల్సి వచ్చింది వంశీకర్కు. మధ్యలో తన ఫోన్ పోగొట్టుకోవడం.. కశ్మీర్లో అక్కడి స్థానికులు వంశీకర్తో గొడవకు దిగడం.. ఇలా చాలా సమస్యలను వంశీకర్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
నేను ఈ ఫీట్ ఏదో ఊరికే సాధించలేదు. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంతో పాటు మన దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించడం కోసం ఈ యాత్ర చేపట్టా. అలాగే.. యూత్ అందరినీ ఎంకరేజ్ చేసి.. ఫిట్గా ఉండి.. ఫిజికల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొనాలని చెప్పడం కోసం ఈ సాహసానికి ఒడిగట్టా. నేను ఫిట్ ఇండియా మూవ్మెంట్ సపోర్టర్ను. జిమ్ చేయడం కన్నా కూడా వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల కలిగే లాభాల గురించి నాకు తెలుసు.. అంటూ వంశీకర్ స్పష్టం చేశాడు.
వంశీకర్.. పర్వతారోహణ మీద కూడా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. పలు పర్వతాలను అధిరోహించి మెడల్స్ కూడా సాధించాడు. ఇదివరకు మౌంట్ భగీరథి 2 అనే పర్వతాన్ని అధిరోహించాడు. భవిష్యత్తులోనూ మరిన్ని పర్వతాలను అధిరోహించి.. సరికొత్త రికార్డు సృష్టించాలనేదే వంశీకర్ కల.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bhongir Fort | తెలంగాణలో ట్రెక్కింగ్కు కేరాఫ్ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?
Winter Tour : చలికాలంలో టూర్ ఎంజాయ్ చేయాలంటే.. తెలంగాణలోనే ఉన్న ఈ ప్లేస్కు వెళ్లాల్సిందే
చలిగిలిలో.. ప్రకృతి ఒడిలో.. హనీమూన్ ట్రిప్స్కు పెరిగిన డిమాండ్