హనుమకొండ, ఆగస్టు 3 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూ భారతి ఆపరేటర్లు రోడ్డునపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారిని తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో భూ భారతి ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాల్లో బఫర్, జిల్లా కో ఆర్డినేటర్, ఫీల్డ్ లెవల్ టెక్నికల్ స్టాఫ్ (ఎఫ్టీఎస్) కలిపి మొత్తం 91 మంది విధులు నిర్వహిస్తున్నారు. 2026 మార్చి నెలతో వీరి కాంట్రాక్టు గడువు ముగిసింది. మళ్లీ రెన్యువల్ అవుతుందని సంతోషపడ్డ ఎఫ్టీఎస్లకు నిరాశే ఎదురైంది. ఈ సారి కేవలం 38 మంది ఎఫ్టీఎస్ సేవలను మాత్రమే కొనసాగించాలని తెలంగాణ గ్లోబల్ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. దీంతో మిగిలిన 53 కుటుంబాలు తమ భవిష్యత్ ఏమిటనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాయి.
అన్ని తహసీల్దార్, రెవెన్యూ డివిజన్, కలెక్టరేట్ కార్యాలయాల్లో భూ భారతి (గతంలో ధరణి) ప్రాజెక్టులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్లు, భూ సంబంధిత సమస్యల కోసం గత పదేళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 91 మంది విధులు నిర్వర్తిస్తున్నా రు. అలాగే ఎన్నికలు, ఇతర సాంకేతిక పనులను రెగ్యులర్ ఉద్యోగులతో పాటు చేస్తున్నారు. అయితే 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 నెలల వేతనాలు రానప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలో కొంతమందికే పనిచేసే అవకాశం కల్పించడంపై మండిపడుతున్నారు.
రిజిస్ట్రేషన్లు తక్కువగా అవుతున్నాయ నే సాకుతో తమకు తగ్గించడంపై వారు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడానికి, తమకెలాంటి సంబంధం లేదని, మారెట్ పరిస్థితులు, భూముల కొనుగోలు, విక్రయాలు, ప్రభు త్వ విధానాలు ప్రభావం చూపుతున్నాయంటున్నా రు. కాగా సోమవారం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేయాలని హనుమకొండ జిల్లా ఇంచార్జి కలెక్టర్కు హనుమకొండ జిల్లా భూ భారతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మంచా ల సాయిరాం, సెక్రటరీ ముత్తినేని సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సోమ సాగరిక, మండలాల ఎఫ్టీఎస్లు, అలాగే ఉమ్మడి జిల్లాలోని మిగతా చోట్ల కూడా వినతి పత్రాలు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి ప్రాజెక్టు కింద ఉమ్మడి వరంగల్ జిల్లా లో మొత్తం 91 మంది మి విధులు నిర్వర్తిస్తు న్నాం. 2026 మార్చి తో మా కాంట్రాక్టు ముగిసింది. ఆ తర్వాత కే వలం 38 మందినే రెగ్యులర్ చేస్తున్నట్లు తెలంగాణ గ్లోబల్ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరిని ఉంచుతారో.. ఎవరిని తొలగిస్తారో అనేది స్పష్టత లేదు. దీం తో ఎఫ్టీఎస్లు ఆందోళన చెందుతున్నారు. 15 నెలలుగా వేతనాలు రాకున్నప్పటికీ విధు లు నిర్వర్తించాం. ప్రభుత్వం పునరాలోచన చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ అందరినీ కొనసాగించాలి. అలాగే పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలి. ప్రతి నెల 1న ఖాతాల్లో వేతనాలు జమచేయాలి.
-నాగరాజు, భూభారతి ఆపరేటర్, హనుమకొండ జిల్లా