జానా ఏడుసార్లు గెలిస్తే ఏడు మంచి పనులూ చేయలే
మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని, మహమూద్అలీ ప్రచారం
హాలియా/ త్రిపురారం, మార్చి 31: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఊరూరా గులాబీ జెండా ఎగురుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఒక్క టీఆర్ఎస్కే ఉన్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సాగర్లో నోముల భగత్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తంచేశారు. ఓటమి భయంతో జానారెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించాలని త్రిపురారం మండలంల్లో రాజ్యసభసభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, వరంగల్ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి బుధవారం జగదీశ్రెడ్డి ప్రచారం నిర్వహించారు. కొణతాలపల్లిలో జరిగిన ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకున్నదని చెప్పారు. సాగర్ ప్రజలు గెలిపిస్తే ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన జానా ఏడుమంచి పనులు కూడా చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచంద్రనాయక్, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జానయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు.
సొంతూరే పట్టని జానా: తలసాని
సుదీర్ఘకాలం మంత్రిగా ఉండి తన సొంతూరు అనుముల అభివృద్ధి గురించి జానారెడ్డి పట్టించుకోలేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. జానాను తిరిగి గెలిపిస్తే ఏం ఉపయోగం ఉండదని స్పష్టంచేశారు. అనుముల గ్రామం, హాలియా పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ను గెలిపించాలని కోరుతూ హోంమంత్రి మహమూద్అలీ, ఎన్నికల మండల ఇంచార్జి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నోముల నర్సింహయ్య సతీమణి లక్ష్మితో కలిసి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక పార్టీ అని, దాన్ని ఎవరూ నమ్మడంలేదని తలసాని చెప్పారు. నియోజకవర్గ వెనుకబాటుకు జానారెడ్డే కారణమని మహమూద్అలీ ఆరోపించారు.
ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం
సబ్బండవర్గాల సంక్షేమం, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హాలియా పట్టణంలో బుధవారం నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీ య సమావేశానికి మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మహమూద్ అలా కోరారు. సమావేశంలో ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు చందర్, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య సతీమణి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
17 నామినేషన్లు తిరస్కరణ
నిడమనూరు, మార్చి 31: సాగర్ శాసనసభస్థానానికి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన బుధవారం ముగిసింది. 77 మంది అభ్యర్థులు 128 నామినేషన్ సెట్లు స మర్పించారు. వివరాలు సరిగా లేని 17 నామినేషన్లు తిరస్కరించారు.
నోముల భగత్కు 136 బీసీ కులాల మద్దతు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. బీసీల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టిన టీఆర్ఎస్ పార్టీకి, అభ్యర్థి భగత్కు 136 బీసీ కులాల సంపూర్ణ మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు బుధవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రెండు మూడ్రోజుల్లో పార్టీలకు అతీతంగా బీసీ కులాల ప్రతినిధులంతా సాగర్కు వెళ్లి బీసీల రాజకీయ ఐక్యతను చాటుతామని చెప్పారు. భగత్కు బీసీలంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా
ఎఫ్సీఐ కావాలనే ఇబ్బంది పెడుతున్నది
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్
రామాయణం, భారతం ప్రపంచానికే తలమానికం
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్షా