వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
వీణవంక, మార్చి 31: రామాయణ, మహాభారతాలు ప్రపంచానికే తలమానికమని.. వాటికి ప్రాధాన్యమిస్తే మనుషుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలుబాక గ్రామంలో భక్త కళామండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరుతల రామాయణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రామాయణ, మహాభారతాలు సంస్కృ తి, సంప్రదాయాలను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రస్తుత సమాజంలో టీవీలు, సెల్ఫోన్ల ద్వారా మానవ సంబంధాలు తెగిపోయాయని చెప్పా రు. మనుషుల మధ్య చిచ్చుపెట్టే యంత్రాలు వచ్చాయని, వాటికి దూరం గా ఉండి నీతితో కూడిన రామాయణ, భారతాలను వీక్షించాలని కోరారు. నేటి రోజుల్లో న్యాయం, ధర్మం గెలువాలంటే రామాయణ, మహాభారతాలు గ్రామాల్లో ప్రదర్శించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా
ఎఫ్సీఐ కావాలనే ఇబ్బంది పెడుతున్నది
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్షా