బిల్లు మంజూరు కోసం రూ.2 లక్షలు లంచం
రెడ్హ్యాండెడ్గా చిక్కిన ఎన్ఆర్ఈజీఎస్ ఈసీ రఫీ
8 మందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
పరిగి టౌన్, మార్చి 31 : ఉపాధిహామీ పనులకు సంబంధించిన బిల్లు మంజూరు చేసేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకొంటుండగా వికారాబాద్ జిల్లా పరిగి ఎన్ఆర్ఈజీఎస్ ఈసీ రఫీని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఎంపీడీవో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొన్నారు. పరిగి మండలంలో ఉపాధిహామీ పనులకు సంబంధించి బంటు చక్రవర్తి అనే పేయింటర్ 770 బోర్డులు రాశాడు. ఇందుకు రూ.10 లక్షల బిల్లు రావాల్సి ఉన్నది. బిల్లు మంజూరు చేయాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని ఎంపీడీవో సుభాశ్చంద్రగౌడ్ డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఈసీ రఫీకి రూ.2 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న ఎంపీడీవో తోపాటు ఏపీవో నర్సింలు, టెక్నికల్ అసిస్టెంట్లు నర్సింలు, గోపాల్, శ్రీనివాస్, జాంప్లా, హన్మంతును అదుపులోకి తీసుకున్నారు.
‘రియల్ ఎస్టేట్’లో ఐటీ సోదాలు
హైదరాబాద్: హైదరాబాద్, భువనగిరి ప్రాంతాల్లోని రియల్ఎస్టేట్ సంస్థలు, వ్యాపారుల ఇండ్లు, కార్యాలయాలపై బుధవారం ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.కోట్ల నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో రికార్డుల్లో చూపని రూ.11 కోట్లు, రూ.రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఓ రాజకీయపార్టీకి చెందిన ఐలయ్య వద్ద కీలక డాక్యుమెంట్లు, రికార్డులు, నగదును స్వాధీనపర్చుకున్నట్టు తెలిసింది. దాదాపు రూ.700 కోట్ల నల్లధనం చలామణి అయినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా
ఎఫ్సీఐ కావాలనే ఇబ్బంది పెడుతున్నది
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్
రామాయణం, భారతం ప్రపంచానికే తలమానికం
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్షా