నడవలేని వృద్ధుడి వద్దకే వెళ్లి ప్రక్రియ పూర్తి
మందమర్రి, మార్చి 31: నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడి వద్దకే వచ్చి భూమి రిజిస్టేషన్ చేయించారు మందమర్రి తాసిల్ కార్యాలయ అధికారులు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అమరవాది గ్రామానికి చెందిన కుడిది చంద్రయ్య(95) తనకున్న 3.09 ఎకరాల వ్యవసాయ భూమిని నలుగురు కొడుకులకు పంచి ఇచ్చాడు. ఆ భూమిని గిఫ్ట్డీడ్ చేసేందుకు బుధవారం మందమర్రి తాసిల్ కార్యాలయానికి ఆటోలో వచ్చాడు. కాగా, చంద్రయ్య నడవలేని, నిలబడలేని స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న నాయబ్ తాసిల్దార్ శ్రీనివాస్రావు దేశ్పాండే, ధరణి ఆపరేటర్ సుప్రియ.. ఆటో వద్దకే ల్యాప్టాప్ తీసుకెళ్లి ఫొటో, వేలి ముద్రలను సేకరించారు. అనంతరం భూమిని చంద్రయ్య నలుగురు కుమారుల పేర గిఫ్ట్ డీడ్ కింద మార్చారు. వృద్ధుడి పట్ల మానవత్వం ప్రదర్శించిన నాయబ్ తాసిల్దార్, ధరణి ఆపరేటర్ను కార్యాలయానికి వచ్చిన రైతులు, ప్రజలు అభినందించారు.
ఇవి కూడా చదవండి:
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా
ఎఫ్సీఐ కావాలనే ఇబ్బంది పెడుతున్నది
రామాయణం, భారతం ప్రపంచానికే తలమానికం
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్షా