సిద్దిపేట : చాట్లపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా.. అందులో భాగంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అర్హుందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తామని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం జగదేవ్పూర్ మండలం చిన్న కిష్టాపూర్, చాట్లపల్లి , మునిగడప, తీగుల్, ఇటిక్యాల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, ప్రారంభోత్సవాలుచేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పల్లెలు ప్రగతి బాట పట్టాయన్నారు. స్వరాష్ట్రo సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ వస్తుందన్నారు. సాగునీరు, తాగునీరు కష్టాలు దూరం చేశామన్నారు. సమైక్య రాష్ట్రంలో 200 రూపాయల ఉన్న పెన్షన్ ను రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కష్టాలను దూరం చేసింది అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
సొంత జాగా ఉండి ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టుకు నేందుకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. 15 రోజుల్లో అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు అవతారం ఎత్తి.. విత్తనాలు చల్లిన మంత్రి హరీశ్ రావు
కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ